Monday, April 29, 2024

గోమాత‌ను కాపాడుకోవాలి : మంత్రి త‌ల‌సాని

గోమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి వరకు 40 మంది సభ్యులు నిర్వహించే మహా పాదయాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ CBI JD లక్ష్మీనారాయణతో కలిసి లిబర్టీలోని TTD దేవాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. ప్రభుత్వం గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, గో ఉత్పత్తుల మార్కెటింగ్ కు అన్ని విధాలుగా అవసరమైన సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. గోవు ప్రాముఖ్యతను తెలియజేస్తూ జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే డిమాండ్ తో పాదయాత్ర చేపట్టిన ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ, ఇతర సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement