Sunday, May 5, 2024

Gold Drop: సంక్రాంతి పండుగకు ఆంధ్ర, తెలంగాణ రుచుల ఆస్వాదన చేయండి…

హైదరాబాద్‌ : ప్రతి సంవత్సరం జనవరి మధ్యలో రంగులు, రుచులు, ఆహ్లాదకరమైన వాతావరణం తో తెలంగాణ కోలాహలంగా మారిపోతుంది. శీతాకాలం ముగిసి, పంట కాలం ప్రారంభం కావటానికి సూచికగా జరిగే నాలుగు రోజుల సంక్రాంతి పండుగ కుటుబం, స్నేహితులతో కొత్త పంట ఆనందాన్ని పంచుకునే సమయంగా నిలుస్తుంది. ఈసందర్భంగా గోల్డ్‌ డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ… కొత్త సంవత్సరంలో కొన్ని రోజులు గడిచి పోయాయి.. సంక్రాంతి పండుగ- ప్రక్షాళన, పునరుద్ధరణను సూచిస్తుందన్నారు. ఆలయ సందర్శనలు, రంగురంగుల రంగోలిలు, వివిధ రకాల వంటకాలు ఇప్పుడు మరింత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. భారతదేశంలోని విభిన్న సంస్కృతుల సమ్మేళన తెలంగాణగా ఉందన్నారు. తాను కుటుంబం, స్నేహితులతో కలిసి -టె-ర్రస్‌ పై నుండి గాలిపటాలు ఎగురవేయడాన్ని ఆస్వాదించానన్నారు. ఆకాశం రంగులు, సృజనాత్మకత కాన్వాస్‌గా మారుతుందన్నారు. పండుగ నిజమైన రుచి ఖచ్చితంగా తెలంగాణలో గోల్డ్‌ డ్రాప్‌లో తయారుచేసిన వంటకాలతో వస్తుందన్నారు. భారతదేశం అంతటా సంక్రాంతిని పొంగల్‌, లోహ్రీ, ఉత్తరాయణ్‌ అని విభిన్న రకాలుగా చేసుకుంటారన్నారు.

భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే నాలుగు రోజుల సంక్రాంతి పండుగ భోజన ప్రియులకు పండగేనన్నారు. ఈ పండుగ వేళ ప్రయత్నించడానికి అనువైన తెలుగు వంటకాల రుచులిలా ఉంటాయి.. పొంగల్‌ పాలు, బెల్లం, నెయ్యితో వండిన అన్నం, పప్పు వంటకమన్నారు. ఇది వెన్న, ఒక వైపు చటీ-్నతో వేడిగా వడ్డిస్తారన్నారు. పొంగల్‌లో రెండు రకాలు ఉన్నాయని, అవి తీపి పొంగల్‌ (చక్కర పొంగల్‌), రుచికరమైన పొంగల్‌ (వెన్న పొంగల్‌) అన్నారు. అలాగే సకినాలు… బియ్యప్పిండి, నువ్వులు, ఉప్పుతో చేసిన క్రిస్పీ, కరకరలాడే చిరుతిండి అన్నారు. ఇది నూనెలో వేయించి, చక్రాల ఆకారంలో ఉంటు-ందన్నారు. ఇది తెలంగాణ ప్రత్యేకత, పండుగ సమయంలో పెద్ద మొత్తంలో తయారు చేస్తారన్నారు. అదేవిధంగా అరిసెలు.. బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి, మృదువైన వంటకమన్నారు. ఇది డిస్క్‌లో చదును చేసి నూనెలో వేయించాలన్నారు.

తర్వాత నువ్వుల పూత పూసి వేడిగా లేదా చల్లగా వడ్డిస్తారన్నారు. కొబ్బరి కజ్జికాయలు… ఈ తీపి పేస్టరీలు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేకత, తురిమిన కొబ్బరి, పంచదారతో నింపబడి, బంగారు రంగు వచ్చే వరకు వేయించి తింటారన్నారు. చెక్కలు… సంప్రదాయ వేయించిన స్నాక్స్‌ అన్నారు. కరకర లాడుతూ, రుచికరంగా వుంటూ ఎంత తిన్నా తినాలనిపిస్తాయన్నారు. అవి బియ్యం పిండి, సెనగ పప్పు, కరివేపాకు, పచ్చి మిరపకాయలు, ఇంగువ వంటి మసాలా దినుసులతో తయారు చేస్తారన్నారు. తెలుగు వంటకాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవడం రుచి, ఆకృతి, సంప్రదాయానికి సంబంధించినవన్నారు. వాటిని ప్రయత్నించడం వల్ల మీకు మరింత కోరిక కలుగుతుందన్నారు. సంక్రాంతి, పొంగల్‌, లోహ్రీ, ఉత్తరాయణ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement