Tuesday, April 30, 2024

టెక్స్ టైల్ పార్క్ లో గోక‌ల్ దాస్ పెట్టుబ‌డులు…

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారతదేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రగతిభవన్‌లో టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో గోకల్ దాస్ కంపెనీ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే సిరిసిల్లలో ప్రభుత్వం సుమారు 65 ఎకరాల్లో పొద్దురు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటికే ఈ పార్కు కు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పూర్తయింది. ఈ పార్కు పూర్తయిన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్ లూమ్ పరిశ్రమతో పాటు స్థూలంగా టెక్స్ టైల్, అప్పారెల్ పరిశ్రమ అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement