Wednesday, May 8, 2024

HYD | టిఫిన్ సెంటర్‌లో పేలిన సిలిండర్.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

ఎల్బీనగర్ ప్రభ న్యూస్ : వనస్థలిపురం రైతుబజార్ సమీపం లోని టిఫిన్ సెంటర్ డబ్బలో బుధవారం సాయంత్రం సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకోడం తో చుట్టుపక్కల వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు మంటలను అర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఎక్కువ అవ్వడంతో పక్కన ఉన్న ఓం సాయి బ్యాగులషాప్ కి వ్యాపించాయి.. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఏమవుతుందో ఆని పరుగులు తీశారు.

పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చాకచక్యంగా మంటలను తొందరలోనే అడుపులోకి తెచ్చారు. టిఫిన్ సెంటర్ ను ఈ రోజే మొదలుపెట్టినట్లు నిర్వాహకులు సుబ్బారావు తెలిపారు. బ్యాగుల షాప్ నిర్వాహకులు రాజకుమార్ సుమారు లక్ష 50వేల వరకు నష్టం జరిగిందని ఆవేదన వెల్లబుచ్చారు. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement