హైదరాబాద్: తమ మాతృ భాషలో డ్యాన్స్ లైక్ ఎ మ్యాన్ వంటి ప్రసిద్ధ నాటకాన్ని చూడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని నటుడు జాయ్ సేన్గుప్తా వెల్లడించారు. ఈ టెలిప్లేలో నటించిన నటుడు జాయ్ సేన్గుప్తా ఈ నాటకం ఇప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుకుంటు-ండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ… దక్షిణాది ప్రేక్షకులు తమ మాతృ భాషలో డాన్స్ లైక్ ఎ మ్యాన్ వంటి ప్రసిద్ధ నాటకాన్ని చూడటానికి ఇష్టపడతారన్నారు. బెంగళూరుకు చెందిన మహేష్ దత్తాని, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నాటక రచయితగా ఎదిగారు. ఈ నాటకం బెంగళూరు నేపథ్యంలో రూపుదిద్దుకుంది.
ఈ నాటకంలో తాను రెండు భిన్నమైన పాత్రలను పోషిస్తున్నానన్నారు. 1950ల నాటి భరతనాట్య నర్తకి, వ్యాపారవేత్త కొడుకుగా నటించటం ఒక పెద్ద సృజనాత్మక సవాలు అన్నారు. థియేటర్ని ఆన్లైన్లో మరింత అందుబాటులోకి తీసుకురావడానికి నాటకాలను అనువదించడం మంచి వ్యూహమని చెప్పిన ఆయన భారతదేశం వందలాది భాషల దేశమన్నారు. ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ ఉన్నారనే దానితో సంబంధం లేకుండా భారతదేశం అంతటా మంచి థియేటర్ని ఆస్వాదించడం చాలా ముఖ్యమన్నారు. ప్రాంతీయ భాషల్లో డ్యాన్స్ లైక్ ఎ మ్యాన్ వంటి నాటకాలు అనువదించటం జీ థియేటర్ చేస్తున్న అద్భుతమైన ప్రయత్నమన్నారు.