Wednesday, May 8, 2024

ఎన్టీఆర్ అభిమానుల సమాఖ్య ఆద్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంచి పెట్టారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య అధ్యక్షులు పి.సాయిబాబా ఆధ్వర్యలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు దాదాపు 150 మందికి పుస్తకాలను ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజనీ, అనిల్ రెడ్డి, సుజాత కార్యక్రమానికి సహకరించి పిల్లలకు నోటు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి.బాల రాజ్ గౌడ్, పెద్దోజు రవీంద్రా దారి, తెలుగు మహిళా అధ్యక్షులు సి.హెచ్. విజయశ్రీ, డివిజన్ అధ్యక్షులు సీహెచ్ ప్రదీప్ గౌడ్, ఎస్. ప్రకాష్, జి.యాదగిరి రావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement