Sunday, May 5, 2024

శ్రీ రక్షిత డైమండ్ జ్యూవెల్స్ ఆధ్వర్యంలో డైమండ్ ఎక్స్ పో

ప్రజల అభిరుచులకు అనుగుణంగా బంగారు, వ్రజాభరణాలను ప్రత్యేక డిజైన్లలో రూపొందిస్తూ కస్టమర్ల మన్ననలు అందుకుంటున్న శ్రీ రక్షిత డైమండ్ జ్యూవెల్స్ ఎక్స్ పోను హైదరాబాద్ లో నిర్వ‌హిస్తున్నారు. నగర వాసులకు ఈ ఎక్స్ పో నిర్వహిస్తున్నామని నిర్వాహ‌కులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు దివ్య రక్షిత మాట్లాడుతూ… ఎన్నో ఏండ్లుగా తాను ఈ వృత్తిలో ఉన్నట్లు చెప్పారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు లేటెస్ట్ కలెక్ష‌న్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రెగ్యులర్ మోడల్స్ తో పాటు హెరిటేజ్ మోడల్స్ సైతం తమ వద్ద లభిస్తాయని ఆమె తెలిపారు. తానే సొంతంగా ఎన్నో డిజైన్లను రూపొందించానని, వాటిని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రజల బడ్జెట్ కు అనుగుణంగా బయట కంటే అతి తక్కువ ధరలకే ఎన్నో బంగారు, వజ్రాభరణాలను అందిస్తున్నట్లు దివ్య రక్షిత స్పష్టం చేశారు. ప్రత్యేక డిజైన్లతో కూడిన ఆభరణాల కోసం శ్రీ రక్షిత డైమండ్ జ్యూవెల్స్ కూకట్ పల్లిలోని వివేకానందనగర్ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉన్న ప్లాట్ నంబర్ 404, 405 లో సంప్రదించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement