Monday, April 29, 2024

TS: వసంత పంచమి సందర్భంగా కర్మన్‌ఘాట్‌ దేవాలయంలో పోటెత్తిన భక్తులు

కర్మన్ ఘాట్, ఫిబ్రవరి 14 (ప్రభ న్యూస్): వసంత పంచమి సందర్భంగా కర్మన్ ఘాట్ ఆంజనేయ దేవాలయ ప్రాంగణంలోని శ్రీ సరస్వతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అక్షర అభ్యస కార్యక్రమాలను వేదమంత్రాలతో అర్చకులు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.

- Advertisement -

భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచి నీటి వసతి కల్పించడంతోపాటు ప్రసాదాలను అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి సామూహిక అక్షరప్యాసంలో నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ నల్ల రఘుమా రెడ్డి ,కార్య నిర్వాహక అధికారి శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement