Monday, May 6, 2024

HYD : ఆహ్లాదం కోసం వస్తే అనారోగ్యo బారిన పడే తీరు

ఎల్బీనగర్, నవంబర్ 2 (ప్రభ న్యూస్) ప్రజలు ఆహ్లాదం కోసం వస్తే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గౌడ్ వాపోయారు. కోట్లు వెచ్చించి చెరువుల సుందరీ కరణ చేస్తూన్నమన్న ప్రభుత్వం మన్సురాబాద్ పెద్ద చెరువును చూస్తే అర్థమవుతుందని అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు మార్నింగ్ వాకర్స్ ను కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద చెరువు నుంచి వెదజల్లుతున్న దుర్వాసనతో పరిసర కాలనీలా ప్రజలు , మార్నింగ్ వాకర్స్,అనారోగ్య సమస్యల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కడి ప్రభాకర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్ ,బద్దుల వెంకటేష్ యాదవ్, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వేదిరి యోగేశ్వర్ రెడ్డి బుడ్డా సత్యనారాయణ, ఇరిగి రమేష్ శ్యాంసుందర్ రెడ్డి, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement