Wednesday, May 1, 2024

HYD : ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి… మధు యాష్కి గౌడ్

కర్మన్ ఘాట్, ఏప్రిల్ 18(ప్రభ న్యూస్) : సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన కర్మన్ ఘాట్ లోని ఎన్ విలేజిలో నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి మధుయాష్కి తో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ,కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అట్టి కార్పొరేషన్కు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పట్టు విడవని విక్రమార్కులని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు మీద్దెల జితేందర్, ఎల్బీనగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు రామ్మోహన్ గౌడ్, జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇడుకుల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య పొలిటికల్ సెక్రటరీ ఆలంపల్లి శ్రీనివాసులు, ,రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశం ,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి బిల్ల కంటి కిరణ్ కుమార్ గుప్తా, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాచేర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, కర్మన్ఘాట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అనంత రవి శెట్టి, వాసా శ్రీదేవి, మహిళా నాయకురాలు గౌని అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement