Sunday, April 28, 2024

TS: నోరు అదుపులో ఉంచుకో… బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తా…జ‌గ‌దీష్ రెడ్డి

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు జ‌గ‌దీష్ రెడ్డి తీవ్ర హెచ్చ‌రిక‌
వైఎస్ బిక్ష‌తో బ‌తికినోళ్లు కేసీఆర్ ను విమ‌ర్శిస్తారా
న‌ల్గొండ జిల్లాకు ప‌ట్టిన శ‌ని ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్
ఆంధ్ర బ్రోక‌ర్స్ అంటూ వారిపై శివాలెత్తిన బీఆర్ఎస్ నేత

నల్లగొండ: తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లేదని చెప్పారు. వారిద్దరికి బ్రోకర్లు అని పేరుందన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు కలిసి నల్లగొండ జిల్లా అన్నదాతలను మోసం చేశారన్నారు. సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్‌ ఇచ్చిన భిక్షతో బతికినోళ్లు.. కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. లేదంటే బట్టలూడదీసి కొడతామంటూ హెచ్చరించారు.

కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని ఫైర్‌ అయ్యారు. తన చరిత్ర ఏమిటో, కోమటిరెడ్డి బ్రదర్స్‌ చరిత్ర ఏంటో చర్చ పెడదామా అంటూ సవాల్‌ విసిరారు. కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ జిల్లాకు పట్టిన శని అని, వారికి సంస్కారం లేదన్నారు. ప్రజల ముందు వారి బండారం బయటపెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, కమలం పార్టీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీకులు ఇస్తున్నారని చెప్పారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement