Saturday, April 27, 2024

BRS – మరో మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన బి ఆర్ ఎస్

భారత రాష్ట్ర సమితి నేడు మరో మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నుంచి క్యామ మల్లేశ్‌ పేర్లను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్‌ పేరును కేసీఆర్‌ ప్రకటించారు. శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకు ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

పెండింగ్ లో హైదరాబాద్ ..

రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్‌ పార్లమెంట్‌కు అభ్యర్థిని ప్రకటించాలి ఉంది. నాగర్‌కర్నూల్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ నుంచి వెంకట్రామిరెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి వినోద్ కుమార్, పెద్దప‌ల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జ‌హీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మ‌హ‌బూబాబాద్ నుంచి మాలోత్ క‌విత‌, మ‌ల్కాజ్‌గిరి నుంచి రాగిడి ల‌క్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం స‌క్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధన్, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య బరిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement