Friday, April 26, 2024

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

కేశంపేట : దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్దాంతాల కోసం, స్వాతంత్ర భారతవాని అభివృద్ది కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మిథున్‌రెడ్డి అన్నారు. ఎక్లాస్‌పేట్‌ గ్రామ నాయకులు ఎలగనమోని అభిషేక్‌ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 41సంవత్సరాల నుండి దేశం కోసం దేశ హితం కోసం త్యాగాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. రెండు సీట్లతో మొదలై నేడు స్వయంగా 303 సీట్లను సాధించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన పేర్కోన్నారు. భారత్‌ మాతకీ జై అనే నినాదాన్ని గుండెల్లో నింపుకోని దేశ సేవ ప్రజా సేవ లక్ష్యంగా ముందుకు సాగాలని కోరుతూ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లె ఆనంద్‌కుమార్‌, పసుల నర్సింహా యాదవ్‌, బిజేపి నాయకులు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement