Tuesday, May 7, 2024

Appeal – అభ్య‌ర్ధుల గుణ‌గ‌ణాలు చూసి ఓటు వేయండి…ఓట‌ర్ల‌కు ఈసీ వికాస్ రాజ్ పిలుపు

హైదరాబాద్ – ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రజలలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు శనివారం గచ్చిబౌలిలో ‘లెట్స్ ఓట్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఈవో వికాస్ రాజ్, డీజీపీ అంజనీ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కులం, మతం, జాతి, ప్రాంతం లాంటి ప్రలోభాలకు లొంగకుంటా అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటు వేస్తే ప్రజాస్వామ్య ప్రక్షాళన జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement