Tuesday, April 30, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లోనూ బిజెపిదే విజ‌యం – ర‌ఘునంద‌న‌రావు..

హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో దుబ్బాక, జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయని దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్స్ ఓట్ల కోసమే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌పై మంత్రి కేటీఆర్ ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ మాట్లాడటం హ్యాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగులతో పీఆర్సీపై చర్చించి సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల‌ను మందబలంతో సభను నడిపితే అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు… నిరుద్యోగభృతిపై సభలో ప్రభుత్వ వైఖరీని నిల‌దీస్తామ‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement