Wednesday, April 17, 2024

మమత పార్టీలోకి బీజేపీ సీనియర్ నేత..

బెంగాల్ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తృణముల్ కండువా కప్పుకొన్నారు. యశ్వంత్ సిన్హా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఓ సీనియర్ నేత. పార్టీ లో చేరేముందు మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత శక్తిమంతంగా ఉంటుందన్నారు. కానీ, ఇప్పుడు న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ భ్రష్ఠు పట్టిపోయాయని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవరూ ఆపలేకపోతున్నారని విమర్శించారు.వాజ్ పేయి హయాంలో బీజేపీ అందరి అభిప్రాయాలను తీసుకునేదని, కానీ, మోదీ హయాంలో అణచి వేస్తున్నారని విమర్శించారు. 2018 లోనే బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు టీఎంసీ లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement