Tuesday, May 7, 2024

Hyderabad – సీఎం స్పీచ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి కెసిఆర్ కాంగ్రెస్ పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యాల‌పై చ‌ర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్ర‌యించింది.. పలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో కెసిఆర్ చేస్తున్న ప్ర‌సంగాల‌పై ఈసికి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవడం లేద‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆరోపించారు.. దీంతో కాంగ్రెస్ నేత బల్మూరి వెంటక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అనంతరం బాన్సువాడ సభలో కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రసంగం చేశారని.. కేసీఆర్ స్పీచ్ తర్వాత కాంగ్రెస్ నేతలపై దాడులు పెరిగాయని బల్మూరి వెంకట్ తన పిటిషన్‌లో ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement