Friday, May 17, 2024

Nizamabad – దోస వేస్తూ…ఓట్లు అభ్య‌ర్ధించిన బిజెపి అభ్య‌ర్ధి ద‌న్ పాల్

నిజామాబాద్ సిటీ ,నవంబర్ (ప్రభ న్యూస్)15: నిజాంబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను… పేదల కష్టాలు తీరుస్తానని నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండనీ..బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనా రాయణ కోరారు. బుధ వారం 39 వ డివిజన్ లోని అంబేద్కర్ కాలోని బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనా రాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఒక హోట‌ల్ లో ఆయ‌న దోసెలు వేశారు.. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ 24 గంటలు అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటానని అన్నారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోత్నాకర్ లక్ష్మి నారాయణ,కొండా ఆశన్న,సంగమేష్, శైలేజా,విగ్నేష్,ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,గాలమణి, పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్,బొట్టు వెంకటేష్,డివిజన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement