Tuesday, May 7, 2024

మెట్రో స‌రికొత్త రికార్డ్ – ఒక్క రోజే 5ల‌క్ష‌ల 10 వేల మంది ప్ర‌యాణం …

హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును నమోదు చేసింది. మెట్రో రైలులో 5 లక్షల 10 వేలమంది సోమవారం నాడు ప్రయాణించారు. ఒక్కరోజే ఇంత భారీస్థాయిలో ప్రయాణికులు ట్రావెల్ చేయడం ఇదే మొద‌టిసారి . నాగోల్ నుండి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుండి కూకట్‌పల్లి రూట్లలో ఎక్కువమంది ప్రయాణించారు.

కాగా, 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో గత కొన్ని రోజులుగా ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆఫీసు వేళ‌ల్లో మెట్రోలో జ‌నం ర‌ద్దీగా ఉంటున్నారు. అమీర్‌పేట జంక్ష‌న్ ఉద‌యం, సాయంత్రం కిక్కిరిసిపోతోంది. ఇప్పటి వరకు హైద‌రాబాద్ మెట్రో రైలు 40 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. ఇక ఇప్పుడు విద్యార్ధుల‌కు సీజ‌న్ పాస్ అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌యాణీకుల సంఖ్య మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement