Tuesday, May 7, 2024

రైతు కన్నెర్ర చేస్తే బీజేపీ భస్మమే: ఎమ్మెల్యే సైదిరెడ్డి హెచ్చరిక

రైతు కన్నెర్రకు బిజెపి పార్టీ భస్మం కాకతప్పదు హుజుర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ధాన్యాం కోనుగుళ్ల విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా హుజూర్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ధాన్యం రాశులు పంట పండుతుందన్నారు. బీజేపీ కంట మండుతుందని అన్నారు. తెలంగాణ రైతాంగం గొంతు నొక్కాలని కేంద్రంలోని బిజెపి సర్కార్ రాక్షస క్రీడ ఆడుతుందని విమర్శించారు. రైతు కన్నెర్ర చేస్తే బిజెపి పార్టీ ఆ మంటలో దహనం కావలసిందేనని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేశారు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ లో నకిలీ విత్తనాలు, ఎరువులు లేకుండా చేయడంతో రైతులకు పుష్కలంగా పంట పండించారని చెప్పారు. రైతులు అప్పులపాలు కావద్దని రైతుబంధు ఇస్తూ, 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైన ప్రభుత్వం టీఆర్ఎస్ దేనని ఎమ్మెల్యే సైది రెడ్డి చెప్పారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పుట్టబోయే బిడ్డపైనా అప్పు.. ఒక్కో ఫ్యామిలీపై రూ.2.50 లక్షల భారం!

Advertisement

తాజా వార్తలు

Advertisement