Thursday, April 25, 2024

వరి కొనుగోలు చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తాం.. ప్రభుత్వ విప్‌..

పెద్దపల్లి యాసంగిలో తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించే వరకు అన్నదాతల పక్షాన తెరాస పోరాటం చేస్తుందని శాసన మండలి విప్ భాను ప్రసాదరావు పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యాసంగిలో కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన రైతు ధర్నాలో మాట్లాడుతూ ..కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. పంజాబ్‌లో వరి కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. అన్నదాత ఉసురు తగిలి బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితోపాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement