Monday, May 6, 2024

Husnaabad – ఇదేనా మీ పద్దతి….?కమీషన్లు తీసుకున్నోళ్లే మీ దృష్టిలో మంచోళ్లా? – బండి సంజయ్

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఇందుర్తికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ఇందుర్తి-సుందరగిరి, ఇందుర్తి-హుస్నాబాద్ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందుర్తి-సుందరగిరి పనుల్లో జరుగుతున్న జాప్యం ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానికులు పనుల తీరులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించడంతో వెంటనే సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని స్పప్టం చేసిన బండి సంజయ్ కుమార్ వచ్చే మార్చి నెలాఖరులోగా రహదారి విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అనంతరం రూ.24 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇందుర్తి-హుస్నాబాద్ విస్తరణ పనులను పరిశీలించిన బండి సంజయ్ ఆయా పనులను సైతం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సిందేనని, జాప్యం చేస్తే సహించేది లేదని స్ఫష్టం చేశారు.

బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ జిల్లా బిజెపి నాయకులు చెప్పియాల మురళి గౌడ్, పోలోజు సంతోష్ కుమార్,పైడిపల్లి శ్రీనివాస్ ,వoగర మల్లేశం , జిల్లా శ్రీనివాస్ , ఉపసర్పంచులు మహేందర్ ,కూన పోశయ్య ,కూన సంతోష్ , పెందోట రఘు ,గట్టు ఎల్లయ్య , తదితరులున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement