Saturday, April 27, 2024

TS : వంద క్వింటాళ్ల రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

జన్నారం, మార్చి 13 ( ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న టీఎస్ 01 యుసి 5722 ఐచర్ వ్యాన్ ను ఇవాళ‌ తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెక్కి వెంకటాపూర్ చెందిన ఓ వ్యాపారి పిడిఎస్ బియ్యాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ రైస్ మిల్ కు తరలిస్తుండగా పోలీసు ఉన్నతాధికార్ల సమాచారం మేరకు పట్టుకున్నారు.

- Advertisement -

అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్న వ్యాన్ ను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై పి.సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. పట్టుకున్న ఆ వ్యాను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో పెట్టామన్నారు. నిందితులు పరారు లో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement