Thursday, May 2, 2024

మానవత్వం చాటుకున్న యువకులు..

కౌటాల ప్రభ న్యూస్ : కొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని ముత్తంపేట్ గ్రామానికి చెందిన మహుల్కర్ హరిదాస్ వయసు 52.. గత 4సంవత్సరాల నుండి పక్షవాతంతో మంచానికి పరిమితమై సోమవారం మృతి చెందారు.. హరిదాస్ అనారోగ్యంతో ఉన్నా సమయంలో కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల నిమిత్తం ఉన్న ఆస్తులను అమ్ముకొని బ్రతికించు కోవాల‌న్న ఆశలు అడి ఆశాలు అయి చివరికి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు.. అటు ప్రాణాలు దక్కించు కోలేక ఇటు ఆర్థిక భారంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న కుటుంబాన్ని చూసి.. గ్రామానికి చెందిన కొందరు యువకులు మానవత్వం చాటుకున్నారు.. హరిదాస్ కుటుంబానికి 50కిలోల బియ్యం, 9వేల నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు.అనంతరం యువకులు మాట్లాడుతూ హరిదాస్ కుటుంబం నిరుపేద కుటుంబం కావున అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని వీరికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజురు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement