Thursday, April 18, 2024

Ganja: రూ.2 కోట్ల విలువైన గంజాయి.. పోలీసుల చెరలో కేటుగాళ్లు

అక్రమ గంజాయి రవాణాపై పోలసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో భారీగా గంజాయి పట్టుబడింది. మల్కాజిగిరి పరిధిలో ఉన్న కౌకుర్‌ దర్గా వద్ద రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రెండు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నులుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, రూ. 2 కోట్ల రూపాయలపైగా విలువైన గంజాయిని పట్టుకొని సీజ్ చేసిన మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement