Saturday, May 4, 2024

TS: నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..

తెలంగాణ రాష్ట్రంలోని నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్‌లో అవకతవకలు, ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, మాగంటి గోపీనాథ్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌తో పాటు సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement