Saturday, April 27, 2024

Breaking | ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్.. తుది తీర్పునకు లోబడే ఉండాలని ఆదేశాలు

ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇవ్వాల (బుధవారం) టీచర్ బదిలీలపై మద్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లపై హైకోర్టు తప్పుపట్టింది. యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలు చేపట్టాలని హైకోర్టు అనుమతించింది. ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి హైకోర్టు అనుమతిచ్చింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశం అని హైకోర్టు అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement