Saturday, April 27, 2024

రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా…

గోషామహాల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈరోజు జరిగిన విచారణలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై వాదనలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ న్యాయవాది జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అదేవిధంగా రాజాసింగ్ తరపు వాదనలను ఎల్ రవిచందర్ మరోసారి వినిపించనున్నారు. ఈ క్రమంలో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement