Wednesday, May 1, 2024

యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యం: పద్మశ్రీ కనకరాజు

జైనూర్ జూన్ 21 (ప్రభన్యూస్) యోగా చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటామని పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు అన్నారు. బుధవారం మండలంలోని మార్లవాయిలో దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.

యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు పలువుతో కలిసి యోగ విన్యాసాలు చేశారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు ఉపసర్పంచ్ సావిత్రి ధర్మేందర్, పంచాయతీ కార్యదర్శి డార్క్ యూత్ సభ్యులు అంగన్వాడి టీచర్, ఆశా వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement