కూతుర్ని ప్రేమించాడని.. మేనమామ మేనల్లుడికి విషమిచ్చి చంపిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. కూతురిని ప్రేమించాడని అల్లుడిని చంపాడు ఓ కసాయి మేనమామ. గూడెం గ్రామానికి చెందిన అనిల్ ను మాట్లాడే పని ఉందంటూ మేనమామ కబురు పంపాడు.
లక్షెట్టిపేట మున్సిపల్ శివారు ప్రాంతం వద్దకు వచ్చిన తరువాత కత్తితో బెదిరించి బీరులో గడ్డిమందు కలిపి తాగించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనిల్ ను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ అనిల్ మరణించాడు. అదేవిధంగా ఆస్పత్రిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను వివరిస్తూ అనిల్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం అనిల్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.