Sunday, May 5, 2024

న‌టుడు అల్లు ర‌మేశ్ క‌న్నుమూత‌

మా విడాకులు వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యారు న‌టుడు అల్లు ర‌మేశ్. విశాఖకు చెందిన టాలీవుడ్ కమెడియన్ అల్లు రమేష్ కన్నుమూశారు. నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన ఆయన ఇటీవల విడుదలైన నెపోలియన్ సినిమాతో పాటు యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అయ్యే ‘మా విడాకులు’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.కాగా గ‌త కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement