Thursday, May 9, 2024

Harithaharam – అత్య‌ధిక మొక్క‌లు నాటిన ఘ‌న‌త దేశంలోనే తెలంగాణాదే – మంత్రి హ‌రీష్ రావు ..

సిద్దిపేట – స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఒకేరోజు కోటి మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్ల‌డించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో పాటు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించి కొన‌సాగిస్తున్నార‌న్నారు..సిద్ధిపేట శివారు రంగనాయక సాగర్ తెలంగాణ తేజోవనంలో శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 30వేల మొక్కలు నాటారు. అనంతరం ఆర్ట్ గ్యాలరీ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 273.33 కోట్లు మొక్కలు నాటి, దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులో నిలిచిందని కేంద్రం పార్లమెంటులో చెప్పిందని వెల్లడించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 30 కోట్లు నాటి రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.

తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు. ప్ర‌పంచంలో పర్యావరణ హితమై బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణకు హరితహారం కార్యక్రమంగా చరిత్రకెక్కిందని మంత్రి వెల్లడించారు. అడవులు పెరగాలి. కోతలు పోవాలనే సీఎం కేసీఆర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో గ్రీన్ కవర్ పెరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పచ్చదనంతో ఇప్పటికే 28 శాతానికి చేరిందని, మరో 5 శాతం సాధిస్తే 33 శాతం అడవులు ఉన్న రాష్ట్రంగా దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని అన్నారు. అన్నింటా ఆదర్శంగా నిలిచినట్లే ఇప్పటికే ఆకుపచ్చ సిద్ధిపేటగా మార్చుకున్నామని, దాన్ని అలాగే కొనసాగిద్దామని, ఎక్కడ పెరిగే మొక్క పడిపోయినా గమనించి దానికి కట్టె కట్టి సరి చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట స్వచ్ఛబడి సందర్శించి చెత్త నుంచి సంపద ఏలా సృష్టించొచ్చునో స్వచ్ఛత పాఠాలు నేర్చుకోవాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ కు మంత్రి సూచించారు.

అంతకు ముందు జెడ్పీ చైర్మన్ రోజాశర్మ మాట్లాడుతూ.. ప్రజాభాగస్వామ్యంతో ముందుకెళ్తున్నామని విజయవంతం అవుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్ రావు మార్గనిర్దేశంలో ఇప్పటికే బొకేలకు స్వస్తి పలికి బదులుగా పూల మొక్కలు ఇచ్చే స్థాయికి చేరుకుందని, మంత్రి శ్రద్ధతో ఆకుపచ్చ సిద్ధిపేటను చేసుకున్నామని వివరించారు.

- Advertisement -

అంతకు ముందు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో 33 శాతం గ్రీనరీ పెంచేందుకు విశేష కృషి ప్రభుత్వం ద్వారా జరుగుతుందని తెలిపారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామ పంచాయతీలో 860 మొక్కలను, ప్రతి మున్సిపాలిటీలో 30 వేల మొక్కలను నాటుతున్నామని పేర్కొన్నారు. గతంలో నాటిన మొక్కలను 80 నుండి 90 శాతం బ్రతికించుకున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో అన్నీ కలుపుకుని 4.72 కోట్ల ప్లాంటేషన్ చేపట్టినట్లు, మూడున్నర కోట్ల మొక్కలు బతికించినట్లు 60 వేల ఎకరాల్లో అటవీ సంపద పెరిగినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement