Monday, May 20, 2024

కృత్రిమ అవయవాలను దివ్యాంగుల‌కు పంపిణీ చేసిన హ‌రీష్ రావు

సిద్దిపేట – భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ , సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో టిటిసి భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రయాన్ని నిర్వ‌హించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన‌ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు 233 మంది దివ్యాంగులకు 17 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను అంద‌జేశారు..

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, సుధా చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement