Tuesday, May 14, 2024

క్రిస్టియ‌న్ భ‌వ‌నాన్ని ప్రారంభించిన మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని ఈరోజు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 3,600 మంది పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్థలం ఇచ్చి ప్రభుత్వ నిధులతోనే తొలిసారిగా నిర్మించుకున్న క్రైస్తవ భవనమ‌ని అన్నారు. ప్రతి యేటా క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement