Monday, May 6, 2024

Harish Rao Counter – పార్టీ మారినా రేవంత్ మనస్సు మారలేదు

సిద్ధిపేట – రైతుల గురించి కాంగ్రెస్ పార్టీకి పట్టదని, ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన పనిలేదు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు. పార్టీ మారినా రేవంత్ రెడ్డి మనస్సు మాత్రం మారలేదు అంటూ మండిపడ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్‌పై నిప్పులు చెరిగారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని ధ్వ‌జ‌మెత్తారు…

నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడాని విమ‌ర్శించారు… పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాల‌న్నారు.. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి అని రైతుల‌కు సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమాలను అభివృద్ధి ఫలాలను చూసి ఓర్వలేకపోతున్నారని, వాటిని తాము అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement