Saturday, April 27, 2024

పిల్లలకు ఉరి వేసి.. ఆ తర్వాత తల్లి..

రాజేంద్రనగర్‌:- హైదరాబాద్‌ శివారు ప్రాంతం రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులకు ఉరి వేసి ఆ తర్వాత తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి స్వాతి(35) తో పాటు కుమారుడు తన్విక్‌ (5), కుమార్తె శ్రేయ (3) మృతి చెందారు. నిన్న రాత్రి భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకోగా.. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇవాళ తిరిగి ఇంటికెళ్లి చూడగా భార్య, పిల్లలు విగత జీవులుగా కనిపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement