Tuesday, May 14, 2024

ఘనంగా వజ్రోత్సవ వేడుకలు- ప్రతి ఇంటిపై జాతీయ జెండా- మంత్రి గంగుల

స్వతంత్య్ర‌ భారత్ వజ్రోత్సవ వేడుకలు తెలంగాణలో ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్క‌ర్ చౌరస్తా నుండి తెలంగాణ చౌక్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేల కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని నింపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement