Sunday, May 5, 2024

గవర్నర్‌ తమిళిసైకు మాతృవియోగం

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కు మాతృవియోగం కలిగింది. గవర్నర్ తమిళిసై తల్లి కృష్ణ కుమారి కన్నుమూశారు. 80 ఏళ్ల వయస్సున్న ఆమె ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివ శరీరాన్ని రాజ్ భవన్ లో ఉంచుతారు. తర్వాత ఆంత్యక్రియల కోసం చెన్నై తరలిస్తారు. కాగా, గవర్నర్‌ తమిళిసై తల్లి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండిః ఆఫ్ఘాన్ నుంచి బలగాల ఉపసంహరణను సమర్థించుకున్న బైడెన్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement