Monday, May 13, 2024

చెల్పూర్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగి ఆత్మహత్య..


గణపురం (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ లో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న బీరెల్లి రమేష్ తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అత‌న్ని వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప‌రీక్షించిన డాక్ట‌ర్‌ రమేష్ అప్పటికే అత‌ను చ‌నిపోయిన‌ట్టు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement