Friday, May 10, 2024

గ్యాస్ సిలిండ‌ర్ మార్చేస్తుంటే.. 5 ఇండ్లు ధ్వంసం.. 17 మందికి గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి ఐదు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 17 మందికి గాయాల‌య్యాయి. ఈ ఘటన ఢిల్లీలోని ఆజాద్ నగర్‌లో ఈ రోజు జ‌రిగింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శ్ నగర్ పోలీసు స్టేషన్‌కు పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి ఓ కాల్ వచ్చింది. ఆజాద్‌పూర్‌లోని లాల్‌బాగ్ మసీదు సమీపంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింద‌ని, దీంతో అగ్ని ప్రమాదం జ‌రిగిన‌ట్టు తమకు సమాచారం అందిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడ 17 మందికి గాయాలయ్యాయ‌ని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామ‌న్నారు.

సిలిండర్ పేలుడు ధాటికి ఐదు ఇండ్లు ధ్వంసమయ్యాయి. నాలుగు ఫైర్ ఇంజన్స్ చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన‌ట్టు పోలీసుల తెలిపారు. పోలీసుల ఎంక్వైరీలో తేలిన విష‌య‌మేమిటంటే.. అక్కడి బిల్డింగ్‌లోని మూడో అంతస్తులో ఉన్న ఒక ఇంట్లో ఒక వ్య‌క్తి సిలిండర్ మారుస్తుంటే పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి అతడి ఇంటి పై కప్పు, గోడలు కూలిపోయాయి. అంతేకాకుండా రెండో అంతస్తులోని మరో నాలుగు ఇళ్లు కూడా కుప్పకూలాయని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement