Saturday, May 4, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప‌ట్టుబ‌డిన బంగారం-మ‌హిళ అరెస్ట్

మ‌రోసారి శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ వద్ద 300 గ్రాముల బంగారం లభించింది. దాని విలువ రూ.15.45 ఉంటుందని చెప్పారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement