Friday, April 26, 2024

ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం.. మరోకరి కోసం గాలింపు

ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గంభీరావుపేట కు చెందిన రవితేజ, సమీర్ లు ఇతర పరీక్షలు ముగియడంతో గ్రామంలోని చెరువులో ఈతకు వెల్లి గల్లంతయ్యారు. చెరువు సమీపంలోని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో రవి తేజ మృతదేహం లభ్యం కాగా సమీర్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement