Friday, April 19, 2024

షాక్ కు గుర‌య్యేలా …. రేకుల ఇంటికి రూ.7.2ల‌క్ష‌ల క‌రెంట్ బిల్లు

అప్పుడప్పుడు పూరి గుడిసెల్లో ఉంటున్న‌ వారికి కూడా క‌రెంట్ బిల్లు వేల రూపాయల్లో వ‌స్తుండ‌డం మ‌నం చూస్తుంటాం… అయితే తాజాగా మరొకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ఫ్యాన్, టీవీ ఉన్న రేకుల ఇంటికి ఏకంగా రూ. 7.2 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. లక్ష్మీదేవిపల్లి హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ కుటుంబం గత నెలలో 117 యూనిట్ల విద్యుత్ ను వినియోగించింది. దీనికి గాను 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో వాళ్లు షాక్ కు గురయ్యారు. లక్షల్లో బిల్లు రావడమేంటని బిల్లు కలెక్టర్ ను అడిగినా సమాధానం ఇవ్వలేదని సంపత్ వాపోయాడు. తమకు సగటున రూ. 400 వరకు కరెంట్ బిల్లు వచ్చేదని చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement