Friday, April 19, 2024

ఈనెల 26 నుంచి బీసీ మంత్రుల బస్సు యాత్ర : ధర్మాన

ఈనెల 26వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు బీసీ మంత్రుల బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో మొదలై.. అనంతపురంలో ముగియనుందన్నారు. ఒకచోట బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం దిశగా అడుగులు పడ్డాయన్నారు. బీసీలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement