Friday, April 19, 2024

Breaking: ఈతకు వెళ్లి మృత్యు ఒడికి.. ఇద్దరు విద్యార్థులు మృతితో విషాదం

ఈతకు వెళ్లిన‌ ఇద్దరు ఇంటర్ విద్యార్థులు నీట‌మునిగి చ‌నిపోయిన‌ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గంభీరావుపేటకు చెందిన రవితేజ, సమీర్ ఇంటర్ పరీక్షలు ముగియడంతో గ్రామంలోని చెరువులో ఈతకు వెల్లి గల్లంతయ్యారు. చెరువు సమీపంలోని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు.

గాలింపులో మొదట రవి తేజ మృతదేహం లభ్యం కాగా సమీర్ కోసం విస్తృతంగా గాలించి చివరకు మృతదేహాన్ని వెలికితీశారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement