Saturday, May 4, 2024

TS: పబ్లిక్ ప్లేస్ లో గంజాయి మత్తులో పోకిరీల హంగామా.. ఐదుగురికి పదిరోజుల జైలుశిక్ష

హైదరాబాద్ : పబ్లిక్ ప్లేస్ లో గంజాయి మత్తులో పోకిరీల హంగామా సృష్టించడంతో ఐదుగురికి పదిరోజుల జైలుశిక్ష విధించింది కోర్టు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోలక్ పూర్, రంగా నగర్ ఏరియాలో గంజాయి సేవించి న్యూసెన్స్ చేస్తున్నట్లు కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడికెళ్లిన పోలీసులపై సైతం గంజాయి మత్తులో ఉన్న పోకిరీలు దురుసుగా ప్రవర్తించారు.

పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కోర్టు ఐదుగురిని మందలించి 10రోజుల జైలు శిక్ష విధించింది. ఇందులో కత్తి పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి ఉండగా, మరో కేసులో మొహానికి ముసుగు వేసుకొని పబ్లిక్ ప్లేస్ లలో కత్తి పట్టుకొని సంచరిస్తున్న వ్యక్తి ఉన్నారు. అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. రిమాండ్ తరలించడంతో కోర్టు 10రోజుల జైలు శిక్ష విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement