Sunday, April 28, 2024

Breaking: ఒకేరోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగ‌లు.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు..

ఈనెల‌ 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగలు జరుగనున్నాయి. హైదరాబాద్ లో జరిగే రెండు ప్రతిష్టాత్మక పండుగల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు హైదరాబాద్ పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు మతాల పెద్దలతో 300 మంది సభ్యులతో పీస్ కమిటీ ఏర్పాటు చేశారు. మిలాద్ ఉన్ నబి వాయిదాకు పీస్ కమిటీ సభ్యులు ఒప్పుకున్నారు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్‌ నబి నేపథ్యంలో సెంట్రల్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో 300 మంది పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 28 వ తేదీన గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగలు జరగనున్నాయి. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో పీస్ కమిటీ కి మిలాద్ ఉన్నబి వాయిదా వేసేందుకు ఒప్పుకున్నారు. అలాగే భక్తులు 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా గణేష్ విగ్రహ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement