Wednesday, May 15, 2024

ప్రతీ ఒక్కరికీ రైతు బంధు: మంత్రి గంగుల

రైతులకు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా బుధవారం కరీంనగర్ లోని గోపాలపూర్ లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గి ఇబ్బంది నెలకొన్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదన్నారు. కళ్యాణలక్ష్మీ, ఆసరా ఫించన్లు, ఉచిత కరెంటు, రైతుబందు వంటివి నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది వడ్లు వేసేవాళ్లకు రైతుబంధు రాదనే విష ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గతంలో మాదిరిగానే ప్రతీ ఒక్కరికీ రైతు బంధుని అందజేస్తుందన్నారు,

కేంద్రం వరిపంటపై అవలంభిస్తున్న వైఖరితో వ్యవసాయ శాఖ సైతం వరికి రైతుబంధుపై సంశయాలు వ్యక్తం చేసిందన్నారు. అయితే, ముఖ్యమంత్రి రైతులకు ఇబ్బంది కలుగనీయవద్దని ఆదేశాలు జారీచేసారన్నారు. అర్హులైన అందరికీ రైతు బందు అందుతుందని స్పష్టం చేశారు. ఈ యాసంగిలో రైతులు ఇష్టమైన పంట వేసుకోవడానికి అనుమతి ఉందన్నారు. అయితే యాసంగిలో కేంద్రం వరి వేయొద్దని, కొనమని చెప్పడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. మిల్లర్లతో, ఇతరత్రా ఒప్పందాలు ఉన్నవాళ్లు సొంత ఏర్పాట్లతో వేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement