Monday, April 29, 2024

శుభ‌వార్త..! 730 పోస్టుల‌తో జాబ్ నోటిఫికేషన్లు..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నవారికి ఏపీపీఎస్‌సీ తీపికబురు చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో 730 పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు.. దేవాదా యశాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టుల భర్తీ చేయనున్నది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా.. దేవదాయ శాఖలో 60 గ్రేడ్‌-3 ఈవో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.

జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూర్పు గోదావరి-64, పశ్చిమ గోదావరి-48, కృష్ణా జిల్లా-50, గుంటూరు-57, ప్రకాశం జిల్లా-56, నెల్లూరు-46, చిత్తూరు-66, అనంతపురం-63, కర్నూలు-54, కడప-51 గా ఉన్నాయి.

ఇక, దేవదాయ శాఖలోని ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు జిల్లాల వారీగా పరిశీలిస్తే.. శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖపట్నం-4, తూర్పుగోదావరి-8, పశ్చిమ గోదావరి-7, కృష్ణా జిల్లా-6, గుంటూరు-7, ప్రకాశం జిల్లా-6, నెల్లూరు-4, చిత్తూరు జిల్లా-1, అనంతపురం-2, కర్నూలు-6, కడప-1గా ఉన్నాయి. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్థరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement