Sunday, May 5, 2024

Breaking | వేములవాడ ఆలయ ఈఓగా గంగయ్య నియామ‌కం..

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఈఓగా బి. గంగయ్యను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న ఆలయ ఇన్‌చార్జి ఈఓగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రసాద్ ను బదిలీ చేస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది.

బి. గంగయ్య స్వగ్రామం చొప్పదండి కాగా, 2014 నుండి సిరిసిల్ల ప్రాంతంలో తహసీల్దార్ గా సేవలందించారు. జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్ పరిపాలన అధికారిగా ఆరున్నర సంవత్సరంగా సేవలందిస్తున్నారు. సౌమ్యుడు, అందరితో కలుపుగోలు అధికారిగా , ముక్కుసూటి వ్య‌క్తిగా పేరుంది.
ఎట్టకేలకు రాజన్న ఆలయ పర్మనెంట్ ఈవోగా గంగయ్యను నియమించడంపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement